Sunday, April 28, 2024

TS: రైతులకు అండగా ప్ర‌భుత్వం… మంత్రి జూపల్లి కృష్ణారావు

బిక్కనూర్, మార్చి 21 (ప్రభ న్యూస్) : అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గురువారం మండలంలోని అంతంపల్లి, జంగంపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ నుండి అనుమతి తీసుకుని రైతులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీపీ గాల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement