Sunday, May 5, 2024

TS: రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటి… ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తామ‌ని హామీ…

హైద‌రాబాద్ – గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయ‌డానికి సంసిద్ధతను వ్యక్తం చేసారు.

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని సిఎంకు ఆయ‌న వివ‌రించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సిఎంకు వివరించారు.


గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ కాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి కూడా ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో ఉన్నారు.. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement