Sunday, April 28, 2024

TS: గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి… నీలం మధు ముదిరాజ్

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కోరారు. పటాన్చెరు అసెంబ్లీ పరిధి బొల్లారంలో కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులను మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. బొల్లారంలోని కౌన్సిలర్ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కలిసిన నీలం మధు ఎన్నికలవేళ అనుసరించాల్సిన దానిపై నాయకులతో మధు చర్చించారు.

గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. INTUC జిల్లా ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, కౌన్సిలర్లు వరప్రసాద్ రెడ్డి, చంద్రయ్య, గోపాలమ్మ, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్, చక్రపాణి, సంపత్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ శివ సాయి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు నీలం మధు ప్రత్యేకంగా శాలువాలు కప్పి వారిని సన్మానించారు.

పార్లమెంటులో వాయిస్ వినిపించాలి.. కౌన్సిలర్ చంద్రారెడ్డి

పార్లమెంటులో నీ వాయిస్ ను వినిపించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో బొల్లారం మున్సిపాలిటీ కౌన్సి లర్ చంద్రారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బొల్లారంకు చేరుకున్న నీలం మధు చంద్రారెడ్డి ఇంట్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మాట్లాడారు. మీ దయ, సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా పార్లమెంట్లో అడుగు పెడతానని మధు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement