Saturday, May 18, 2024

Snake Bite – పాము కాటుకు గురై ఆరేండ్ల చిన్నారి మృతి…

నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని హంపోలి ( కె ) గ్రామానికి చెందిన బసేన్ల సాయినాథ్ రజిత ల కూతురు బసేన్ల నిత్య ( 6 ) అను చిన్నారి ఇంట్లో పడుకున్న సమయంలో పాము కాటుకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు . కుటుంబ సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి.

కుటుంబ సభ్యులు భోజనం చేసి, రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురి కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించగా , ఆసుపత్రిలోచికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement