Monday, April 29, 2024

డాక్టర్ కావాలని కోరుతూ జోరువాన‌లో గిరిజనుల ధ‌ర్నా

జైనూర్,జూలై21( ప్రభన్యూస్) మా డాక్టర్ మాకు కావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషగం ప్రభుత్వ ఆసుపత్రి ముందు గిరిజనులు ప్రధాన రోడ్డుపై వర్షంలో సైతం గొడుగుల సహకారంతో మా డాక్టర్ మాకు కావాలని ప్లే కార్డులతో ధర్నా నిర్వహించారు. ఉషాగం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి రాజును లింగాపూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయడం తో గిరిజనులు ఆయన బదిలీని నిలిపివేసి ఇక్కడనే ఉంచాలని డిమాండ్ చేశారు.

వైద్య అధికారి రాజును ఇక్కడనే ఉంచాలని ఇటీవల ఆసుపత్రి సందర్శించిన జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మికి గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావు కు విన్నపించడం జరిగిందని వారు కూడా వైద్యాధికారి రాజును ఇక్కడే విధులు నిర్వహించేలా బదిలీ రద్దు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి ప్రజాప్రతిని తీసుకువెళ్లి డాక్టర్ రాజు ను ఇక్కడే విధులు నిర్వహించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. లింగాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వేరే డాక్టర్ను నియమించాలని బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఊషగం ఆస్పత్రి పరిధిలోని గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement