Sunday, May 19, 2024

NLG: తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి

మద్దిరాల, అక్టోబర్ 3, ప్రభ న్యూస్ : తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని చిన్నేముల గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న నేల గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు (38) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో తాటిచెట్టు పై నుండి ఒకేసారి కింద పడడంతో అక్కడికి అక్కడే మృతిచెందాడు.

అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. శవపరీక్షల నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement