Saturday, May 4, 2024

TS: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం..

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. క్యాంపస్‌లో గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సిబ్బందికి పట్టుబడ్డారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లోని బాయ్స్ హాస్టల్ బిల్డింగ్‌పై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర నుండి గంజాయి తీసుకువచ్చినట్లు సమాచారం. పటిష్ట భద్రత ఉండే క్యాంపస్‌లోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ విద్యా కేంద్రమైన బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement