Friday, April 26, 2024

పేద‌ల‌కు ఉచిత సేవ‌లు అభినంద‌నీయ‌మం – మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట : గరీబొంకే కిద్మత్ కేలియే.. ముఫ్త్ మే..! పేదోళ్ల సాయం కోసం.. ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఇక్బాల్ మినార్ సమీపంలో ఎన్.వీ.కే కమ్యూనికేషన్ మీ సేవ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిల్లతే ఇస్లామీయ వెల్ఫేర్ సొసైటీ తరపున పేదలకు ఉచితంగా మీసేవ కేంద్రం సేవలు అందించేందుకు ముందుకొచ్చిన సొసైటీ ప్ర‌తినిధి ఖాదర్ ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మీ సేవ నిర్వహణ మిల్లతే ఇస్లామీయ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement