Tuesday, May 7, 2024

జూరాల ప్రాజెక్టులో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి

జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వలో నలుగురు గల్లంతు కాగా.. అందులో ఒకరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో వన పర్తి జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వలో నలుగురు గల్లంతు కాగా… స్థానికులు ఇద్దరిని కాపాడారు. ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడు లోయర్ జూరాల జెన్ కో ఏడీ రాజేంద్ర ప్రసాద్ గా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement