Sunday, May 5, 2024

TS: మాజీ ఎమ్మెల్సీ బాలసానిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మార్పులు, చేరికలు వేగంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వెళ్లి కలిశారు.

ఈసందర్భంగా బాలసానిని వారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో పార్టీ మారే ఆలోచనలో బాలసాని ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బాలసాని బాటలో ఖమ్మంకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ జేసీ కృష్ణ, కమర్తపు మురళీ ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement