Sunday, April 28, 2024

‘కడెం’ ప్రాజెక్టుకు వరద… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

జన్నారం, జులై 18(ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రాజెక్ట్ ఏఈ రాథోడ్ విఠల్ తెలిపారు. ఆ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో(క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున మంగళవారం రాత్రి ఎప్పుడైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు వదిలే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతం (దిగువ)కడెం, దస్తూరాబాద్, జన్నారం దండేపల్లి, లక్షేటిపేట పశువుల, గొర్రెల, జాలర్లు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement