Saturday, May 4, 2024

TS: బ‌స్సు టైరు ఊడిపడి మంటలు… త‌ప్పిన ప్ర‌మాదం…

బెంగళూరు నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎంఆర్ ఎక్స్ ప్రెస్ ట్రావెల్స్ బస్సుకు భారీ ప్ర‌మాదం త‌ప్పింది. ముందర టైరు ఊడిపోవడంతో రోడ్డు రాపిడి వల్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులను దించేశాడు.

ఈ ఘ‌ట‌న మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజి దగ్గర జాతీయ రహదారి 44 పై చోటుచేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 30 నుండి 35 మంది ప్రయాణికులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement