Thursday, May 2, 2024

HYD: పార్కింగ్ కారులో మంట‌లు..

కార్ల‌లో మంట‌లు చెల‌రేగుతున్న ఘ‌ట‌న‌లు ఇటీవల కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి ఘ‌ట‌న‌లో చోటుచేసుకుంటుండ‌డంతో ఖరీదైన కారు అయిన సరే ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా చందానగర్ లో ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. చందానగర్ మున్సిపల్ అఫిస్ వద్ద పార్క్ చేసి ఉన్న టాటా ఇండిగో కారులో ఉన్నట్టుండి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే.. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement