Sunday, April 28, 2024

TS : ములుగు దండ‌కార‌ణ్యంలో అగ్నిప్ర‌మాదం…

అసలే వేసవి కాలం, ఎండ తీవ్రతతో రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలోనే ములుగు జిల్లా అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంకటాపురం మండలం ముకునూర్ పాలెం అటవీ ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ క్రమంలోనే మంటలు పక్కనే ఉన్న జామాయిల్ తోటకు అంటుకుని వేగంగా గ్రామం వైపు వ్యాపించాయి. ఈ పరిణామంతో ముకునూర్ పాలెం గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వెంట‌నే అగ్నిమాప‌క అధికారుల‌కు గ్రామ‌స్థులు స‌మాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement