Friday, April 26, 2024

Fire Accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారు చేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో కాటన్ వేస్ట్ వుండటంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడాని గంట పాటు శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement