Friday, April 26, 2024

ప‌రుపుల ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం..రూ. 8ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం..

ప‌రుపుల ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ శివారు రాజేంద్ర‌న‌గ‌ర్ మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీ లో చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ మంటలను చూసి ఇళ్ళ‌ నుండి బయటకు పరుగులు తీసారు స్థానికులు… దట్టమైన పొగ కమ్మెయడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో 8 లక్షల మేరా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది వెల్లడించింది అగ్నిమాపక సిబ్బంది. పరిశ్రమ కు ఏలాంటి అనుమతులు లేవని గుర్తించారు అధికారులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement