Thursday, April 18, 2024

మానేరు వాగులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో గల్లంతైన విద్యార్థి సింగం మనోజ్ (16) మృతదేహాన్ని గుర్తించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, కరీంనగర్ నుంచి రెస్క్యూ టీం సహాయంతో సోమవారం రాత్రి నుంచి నిర్విరామంగా గాలింపు కొనసాగించారు. ఈ క్రమంలో
బుధవారం ఉదయం 8.30 గంటలకు మానేరు వాగులో ముళ్లకంపలో చిక్కుకున్న మనోజ్ మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మనోజ్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు

కాగా, ఈనెల 15న మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజే కొలిపక గణేశ్‌ మృతదేహం లభించగా, జడల వెంకట సాయి (13), శ్రీరామ్ క్రాంతికుమార్‌ (13, తీగల అజయ్ (14), కొంగ రాకేష్ (11) మృతదేహలు మంగళవారం లభ్యమైయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement