Monday, May 20, 2024

కుషాయిగూడ టింబ‌ర్ డిపోలో అగ్ని ప్ర‌మాదం – ముగ్గురి స‌జీవ ద‌హ‌నం..

హైదరాబాద్‌ కుషాయిగూడలో జ‌రిగిన‌ అగ్నిప్రమాదంలో చిన్నారి సహా దంపతులు సజీవ దహనమయ్యారు. ఇక్క‌డి టింబర్‌ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగడంతో క్షణాల్లోనే పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకుని మరణించారు.
మరో చిన్నారి ఆచూకీ తెలిరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement