Monday, May 6, 2024

FIR Filed – పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్యలు – రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదు ….

నాగర్ కర్నూల్: పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి ,సంపత్ కుమార్ లపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి ఫిర్యాదుతో కేసు నమోదైంది. గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు మేరకు ఐసీసీ 153, 504 సెక్షన్ల కింద సెక్షన్లలో కేసు నమోదు చేశారు.

నాగర్ కర్నూల్ లో సోమ‌వారం నాడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, . అధికారులు ముఖ్యంగా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారుల జాబితాను సిద్దం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. వారిని గుడ్డ‌లు ఊడ‌దీసి కొడ‌తామంటూ రేవంత్ హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రేవంత్ తో స‌హా మాజీ ఎమ్మెల్యేలు ఇద్ద‌రిపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement