Monday, April 29, 2024

Filed Case – కెటిఆర్ , గోరటి వెంకన్న ఇంటర్వ్యూ.. నిర్వాహ‌కుడిపై కేసు నమోదు….

హైద‌రాబాద్ – మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదైంది. వారిద్దరితో కలిసి అమరవీరుల స్మారక ప్రాంగణంలో ఇంటర్వ్యూ నిర్వహించిన నిర్వాహకుడిపై తాజాగా సైఫాబాద్ పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ ఇంటర్వ్యూపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. కేటీఆర్ ఇంటర్వ్యూను డ్రోన్‌లతో తీశారని, దీనికి పోలీసులు పర్మిషన్ ఎలా ఇచ్చారని కాంగ్రెస్ నేత జి. నిరంజన్ ఇటీవల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆర్వో సూచనతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement