Friday, May 3, 2024

Jana Sena – అగ్నిప్ర‌మాద మ‌త్య్య‌కారుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో మత్స్యకారులు తమ బోట్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే. తమకు జీవనాధారమైన బోట్లు ప్రమాదంలో బూడిదైపోయాయి. ఈ ఘటనపై స్పందించిన జనసేనాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు పవన్ కల్యాణ్ తీపికబురు చెప్పారు. విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధం అయిన ఘటనలో బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

నష్టపోయిన బోట్లయజమానులకు వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున నుండి రూ. 50వేల‌ ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి పరిహారం అందజేస్తానని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement