Monday, April 29, 2024

ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు : బండి సంజ‌య్

తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… బీజేపీ ఎంపీల‌పైనే దాడులు చేస్తారా అన్నారు. టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌స్ట్రేష‌న్ లో ఉన్నార‌న్నారు. ఈ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ని.. వారికి మ‌ద్ద‌తు నిర‌స‌న‌లు తెలిపితే దాడులు చేయిస్తుంద‌న్నారు. మొన్న త‌న‌పై దాడి చేశార‌ని, నిన్న అర‌వింద్ పై దాడి చేశార‌న్నారు. ఈ దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement