Saturday, April 27, 2024

MDK: విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకుల మృతి

గజ్వేల్, అక్టోబర్ 15 (ప్రభ న్యూస్) : గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య, కుమ్మరి భాస్కర్ తండ్రి కొడుకులు. ఇద్దరు ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు పని నిమిత్తం వెళ్లారు. పొలం వద్ద విద్యుత్ లైన్ తెగి కింద పడిపోయిఉంది.

తెగిపోయిన విద్యుత్ లైన్ ను తీసేందుకు కనకయ్య యత్నించగా అతనికి విద్యుత్ షాక్ తగిలింది. అతని కొడుకు భాస్కర్ సైతం విద్యుత్ లైన్ పట్టుకోగా ఇద్దరు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటనపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement