Sunday, April 28, 2024

TS | హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, కూతుళ్ల మృతి

దమ్మపేట (ప్రభన్యూస్) : ఖమ్మం జిల్లా మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై శ‌నివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి క్షత గాత్రుడు చీపు బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన చీపు బాలకృష్ణ తన ద్విచక్ర వాహనంపై భార్య లక్ష్మి (30), ఇద్దరు కూతుళ్లు శరణ్యశ్రీ (8), షన్మిక శ్రీ (6) ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి అశ్వారావుపేట వైపు వెళ్తుండగా… దాబా హోటల్ సమీపంలో మొదట కారు ఢీ కొట్టగా , కిందపడిపోయామని, ఆతర్వాత లారీ తమపైనుంచి వెళ్లిందని బాలకృష్ణ తెలిపాడు.

ఈ ప్రమాదంలో క్షతగాత్రుడి భార్య, ఇద్దరు కూతుళ్లు ఘటనా స్థలంలో మృతి చెందారు. బాలకృష్ణకు స్వల్ప గాయాలవడంతో 108 వాహనంలో దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యి చెల్లా చెదురుగా పడటంతో అందరినీ కలచి వేసింది. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement