వెల్దుర్తి మండలంలో కరెంట్ షాక్తో రైతు చనిపోయాడు. వ్యవసాయ పొలం వద్ద బోరు మోటర్ వైరు బిగిస్తుండగా విద్యుత్ షాక్కి గురయ్యాడు. వెల్దుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని శేరీల గ్రామంలో ఇవ్వాల (బుధవారం) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ్ల మైసయ్య (45) వ్యవసాయ పొలంలో రాత్రి బోరు మోటర్ వైరు బిగిస్తున్న క్రమంలో ఒకసారిగా కరెంటు షాక్కి గురయ్యాడు. దీంతో అక్కడే కింద పడిపోవడంతో గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకొస్తున్న క్రమంలో మృతి చెందాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement