Sunday, May 5, 2024

విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం

మద్దిరాల జులై 18 ప్రభ న్యూస్ – విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు కిందికి జరగడంతో దానిని స్టే వైర్ తో కట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు అతనికి ఒక భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement