Tuesday, April 30, 2024

WGL: కార్మికశాఖలో దోపిడీ… నిరసనగా కార్యాలయానికి తాళం..

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న కార్మిక శాఖ కార్యాలయానికి ఏఐటియుసి నాయకులు మియపురం గోవర్ధన్ తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి రోజూ కార్యాలయానికి రావాల్సిన అధికారులు రాకుండా మీసేవ కేంద్రాలను నిర్వహించే ప్రైవేట్ వ్యక్తులతో దందా నడుపుతూ ప్రజలను దొచుకుతింటున్నట్లు ఆరోపించారు.

లేబర్ కార్డుకు ధరకాస్తు కోసం రూ.400వందలు వసూలు చేస్తూ లేబర్ కార్డుని అందని ద్రాక్షగా చేస్తున్నట్లు ఆరోపించారు. కార్యాలయం పేరుకే, అధికారి ఇక్కడ ఉండడని కమిషన్ల కార్యాలయాలు ఉన్న చోట అధికారి ఉంటాడని అన్నారు. పోలీస్ కేసులు నమోదైనా లేబర్ అధికారి అలీ తీరులో మార్పు రాలేదని ఆయన అన్నారు. వేసిన తాళాన్ని ఒకటి కలెక్టర్ కు, ఇంకొకటి శాఖ ఉన్నతాధికారి అందజేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement