Sunday, May 5, 2024

శివాల‌యం విగ్రహ ప్రతిష్టలో మాజీ ఎమ్మెల్యే కూన

పేట్ బ‌షీరాబాద్ : కొంపల్లి జయభేరి పార్క్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అద్వర్యంలో శివాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. కూన శ్రీశైలం గౌడ్ ను ఆలయ కమిటీ వారు కండువా కప్పి సత్కరించారు.
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… ఆ భగవంతుడు అందరిని సుఖ సంతోషాలతో ఉండేటట్లు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు రజిని జీవన్ రెడ్డి, రాజిరెడ్డి, శశికళ ఉదయ భాస్కర్, శకుంతల జనార్ధనరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మధుసూదన్ రావు, గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, గిరిధర్, పరమేశ్వర్, లక్ష్మణ్ రావు, సాయిబాబా రాజు, సురేందర్ రెడ్డి, రవీందర్ గుప్తా, వెంకట్ రెడ్డి, బీర్ పాల్ సింగ్, దుర్గారావు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement