Sunday, May 5, 2024

ఆలేరు అభివృద్దే నా ధ్యేయం.. మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ పాదయాత్ర

ఎనమిది ఏండ్లుగా ఆలేరు అభివృద్ధి కుంటుపడిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. మంగళవారం  తపాస్ పల్లి రిజర్వాయర్ ద్వారా సాగు జలాలను అందజేయాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం జాల గ్రామంలోని చెరువు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ నేతలు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్ రావ్ తోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement