Sunday, May 5, 2024

వేధిస్తే ఖబడ్ధార్.. టీఆర్ఎస్ సర్కార్‌కు ఈటల వార్నింగ్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తమదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు.  2024 ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక సన్నాహకం వంటిదని తెలిపారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్ వేదిక అయిందని, ఇకపై ఇంటింటి ప్రచారం చేస్తానని వెల్లడించారు. ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారని చెప్పారు. హుజురాబాద్ పై చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఏమైనా ఆత్మగౌరవం ఉందా? అని ప్రశ్నించారు. తన మద్దతుదారులను వేధిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలీజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాళ్ళను వేధిస్తే ఖబడ్ధార్ అని ఈటల హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement