Sunday, April 28, 2024

తెలంగాణలో మరింత తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది. గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ తో 13 మంది మరణించారు. అదే సమయంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 మందికి కరోనా నిర్ధారణ కాగా అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. ప్రస్తుతం 19,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 3,534 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,86,362 మంది ఆరోగ్యవంతులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement