Wednesday, May 15, 2024

TS : గ‌జ్వేల్ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి

హుజురాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధర్మ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధర్మం గెలిచిందని..తాను కూడా గెలిచాన‌ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ‌జ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న ఎన్నికల ప్రచారాన్నినిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్ అంటే.. రాజీనామా చేసి గెలిచి చూపించానన్నారు.న్నారు. ఆనాడు గజ్వేల్‌లో మీ మీద పోటీ చేస్తానని చెప్పిన విధంగానే ఈరోజు మీపై పోటీకి దిగానన్నారు. కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా కూడా మీకు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించుకుంటామని గజ్వేల్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement