Friday, May 3, 2024

Medak | పండ్లతోటలు, ఆయిల్ ఫామ్ పెంపకానికి ప్రోత్సాహకం: కలెక్టర్ రాజర్షి షా

ఉమ్మడి మెదక్ బ్యూరో, (ప్రభ న్యూస్): మెదక్ జిల్లాలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జులై 31 నాటికి జిల్లాలో 1500 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఆసక్తి గల రైతులను గుర్తించాలని రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ .. 5 ఎకరాల లోపు భూమి, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతుల‌కు 100 శాతం రాయితీ, సన్న , చిన్న కారు రైతులను 90 శాతం రాయితీ కింద‌ లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అర్హులని తెలిపారు. వీరికి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

పండ్ల తోటల సాగు కింద మామిడి, నిమ్మ, నారింజ ,జామ, సీతాఫలం సపోటా, మునగ,డ్రాగన్,దానిమ్మ ప్లానిటేషన్ కు 1500 ఎకరాలు ఎంపిక చేయాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జులై చివరినాటికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆగస్టు నెలాఖరు వరకు డ్రిప్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి, ఉపాధి హామీ పథకం కింద గుంతలు తవ్వి పండ్ల మొక్కలు నాటడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. పండ్ల తోటలో అంతర్ పంటలు వేసుకునే అవకాశం ఉండడంతో రైతులకు రెండు రకాలుగా ఆదాయం లభిస్తుందని, సంప్రదాయ పంటలతో రైతుల నష్టపోతున్న నేపథ్యంలో వాటి పరిష్కారంగా ఉద్యాన పంటలను సాగు చేసుకోవ‌చ్చ‌న్నారు.

దీనిపై జిల్లాలో రైతులకు విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫాo తోటలు పెంపకానికి ఈ సంవత్సరం 2023-24 లో 5 వేల ఎకరాలలో సాగుకి ప్రభుత్వ అనుమతి లభించిందని, ఆయిల్ ఫామ్‌ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం క్రింద నాలుగు సంవత్సరాలకు రూ 25 కోట్ల రూపాయలను రాయితీ గా అందజేస్తుందని తెలిపారు.

- Advertisement -

ఆయిల్ ఫాo సాగుకు ఎకరాకు రూ 50,918 రాయితీ ప్రభుత్వం ఇస్తుందని ఆసక్తి గల రైతులు దరఖాస్తులు జులై 30 వరకు వసాయ విస్తరణ అధికారికి లేదా ఉద్యానవన అధికారికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎంపికైన రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో PD DRDA శ్రీనివాస్ , ఉద్యాన ,పట్టు పరిశ్రమల అధికారి డి . నర్సయ్య , అగ్రికల్చరల్ శాఖ డివిషనల్ అధికారులు లీవింగ్ ఫుడ్స్ ఇండియా ప్రతినిధి డ్ర్. కృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement