Monday, April 29, 2024

పాలేరు నవోదయలో విద్యార్థులకు విద్యుత్ షాక్.. ఒకరు మృతి, ముగ్గురికి స్వల్ప గాయాలు

(కూసుమంచి – ప్రభ న్యూస్) : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో నలుగురు విద్యార్థులకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. విద్యాలయ ఆవరణలో విద్యార్థులచే పాఠశాల సిబ్బంది ప్రధాన గేటు (ప్రవేశ ద్వారం) ముందు పారిశుద్యం నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాకుకు గురైయ్యారు. విద్యాలయం ప్రధాన గేటుపై భాగంలో 11 కెవి విద్యుత్ లైన్ ఉండటంతో విద్యార్థులు ప్రధాన గేటు ముఖద్వారం ముందు బోర్డు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ వైర్లకి ఇనప బోర్డు తగిలి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయింది.

దీంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థత కు గురికాగా, ఒకరు మృతిచెందారు. విద్యాలయంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కొక్యతండా గ్రామానికి చెందిన హలవత్ దుర్గా నాగేందర్ (16) ని 108 సహాయంతో ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృతి చెందాడని సమాచారం. పిల్లలతో పారిశుధ్య పనులు నిర్వహించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో విద్యాలయంలో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement