Saturday, April 27, 2024

Election Campaign – మెట్రోలోనూ కెటిఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం… ప్ర‌యాణీకుల‌తో మాటా..మంతి..(వీడియోతో )

హైదరాబాద్ – తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మన్నటి వరకూ రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ తన ప్రచారంలో సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ఓట్ల‌ను అభ్య‌ర్ధిస్తున్న‌ కెటిఆర్ తాజాగా హైదరాబాద్ మెట్రోలో పర్యటించి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తీవ్ర రద్దీ నడుమ ఐరన్ రాడ్డును పట్టుకొని నిలుచున్నారు. ప‌లువురితో ఆయ‌న మాట్లాడారు… వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు..

హైద‌రాబాద్ లో వ‌చ్చిన మార్పును, అభివృద్ధిని వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.. ఈసారి తాము అధికారంలోకి వ‌స్తే మెట్రోను విస్త‌రిస్తామ‌న్నారు.. అభివృద్ధి చేసిన పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు కెటిఆర్ . అలాగే ఒక ప్రయాణికుడితో ఎన్ని రోజులు అయింది హైదరాబాద్‌కి వచ్చి అని ప్రశ్నించారు. ఆయనతోపాటూ ప్రయాణించిన వారు కేటీఆర్‌ను తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ సందడిగా గడిపారు. రాయ‌దుర్గం నుంచి బేగంపేట స్టేష‌న్ వ‌ర‌కు ఆయ‌న మెట్రోలో ప‌య‌నించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement