Monday, April 29, 2024

Election Campaign – జాన్సన్ ను గెలిపిస్తే ఖానాపూర్ ను దత్తత తీసుకుంటా – కేటీఆర్

జన్నారం,నవంబర్17(ప్రభన్యూస్) :ముచ్చటగా కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఖానాపూర్ లో బిఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ను భారీ మేజారిటీతో గెలిపించాలని, కరెంట్ కావాలా సక్రమంగా కరెంట్ ఇవ్వని కాంగ్రేస్ కావాలా ఆలోచించుకోండి ప్రజాలారా అంటూ రాష్ర్ట ఐటి శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు అన్నారు.మంచిర్యాల జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిధులుగా హజరైన ఆయన మాట్లాడుతూ, మతం పేరుతో మంటలు పెట్టే బిజేపి కావాలా,ఖానాపూర్ అసెంబ్లి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసే జాన్సన్ నాయక్ కావాలా ప్రజలారా ఇంటికి వెళ్లాక ఆలోచించుకోండి అంటూ ఆయన ఆసక్తి కరంగా చెప్పారు.జాన్సన్ ను గెలిపిస్తే ఖానాపూర్ నియజక వర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లా నియోజక వర్గంలాగా కనివిని ఎరుగని విధంగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.

55ఏళ్ల పాలనలో రాష్ర్టాన్ని కాంగ్రేస్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని,పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.మూడోసారి బిఆర్ఎస్ ఎంఎల్ఎ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించనట్లయితే తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని,ప్రజలంతా కాంగ్రేస్ , బిజేపి వాళ్ల మాటలు నమ్మి ఆగమాగం కాకూడదన్నారు.బిఆర్ఎస్ గెలిస్తే తెలంగాణాలోని ప్రజలు,నేతలంతా పని చేసుకోవచ్చని,కాంగ్రేస్ ,బిజేపి గెలిస్తే ఆ నేతలంతా ఢిల్లీ వెళ్లి అక్కడి నేతల మాటలతో ఇక్కడ పరిపాలిస్తారని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో ఖానాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ ,పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత,జడ్ పి చైర్మన్ రాథోడ్ జనార్దన్,ఉమ్మడి జిల్లా ఎంఎల్సి దండె విఠల్, పార్టీ రాష్ర్ట, మండల నేతలు ఎస్.వేణుగోపాల్ చారి, రవీందర్ రావు,పూర్ణచందర్ నాయక్,ఎంపిపి మాదాడి సరోజన రవీందర్రావు,జడ్ పిటిసి చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారాం రెడ్డి, జనార్దన్, పొనకల్ సర్పంచ్ భూమేష్,ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement