Sunday, May 19, 2024

TS : రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ ఎన్నిక‌ల ప్ర‌చారం

సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నేటి సాయంత్రం ఇబ్ర‌హీంప‌ట్నంలో సీఎం రోడ్‌షో, కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంత‌రం ఉప్పల్‌, సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌ల‌లో పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే ఏం లాభం లేదని చెబుతున్న రేవంత్.. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరి.. మిగిలిన హామీలు కూ డా నెరవేర్చుతామని చెబుతున్నారు. పదిహేను ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తున్న సీఎం.. విపక్షాలకు సంబంధించిన ఏ పాయింట్ను వదలకుండా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే తమ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement