Tuesday, May 21, 2024

HYD : నాగోల్ డివిజ‌న్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి సుధీర్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం

నాగోల్, నవంబరు 20(ఫ్రభ న్యూస్) సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గుడిసెలో గల్లీ,గల్లీ తిరుగుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు సుధీర్ రెడ్డికి బ్రహ్మారథం పట్టారు.సుధీర్ రెడ్డికి వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని హామీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి ఎల్.బీ.నగర్ లో మూడవ సారి విజయం సాధించడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని,వాటిని దశలవారీగా పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ,సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, భరాస సీనియర్ నాయకులు రాజి రెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి కార్యకర్తలు, నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement