Thursday, May 2, 2024

ఎలగందల్ ఖిలాకు త్రివ‌ర్ణ శోభ‌.. ఎల్ఈడీ లైట్ల‌తో మెరుస్తున్న చారిత్రక కట్టడం

స్వాతంత్ర్య‌ భారత వజ్రోత్సవాల్లో భాగంగా చారిత్రక కట్టడాలను త్రివర్ణ పతాకం రంగులతో అలంకరించాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కొత్తపల్లి మండలం ఎలగందల్ లోని ఖిల్లాను జిల్లా టూరిజం శాఖ త్రివర్ణ రంగులతో ఆకర్షణీయంగా అలంకరించింది. ఇందుకుగాను ఆ గ్రామానికి చెందిన యువశక్తి కలర్ గ్రానైట్ మేనేజింగ్ డైరెక్టర్ జాగిరి అంజయ్య గౌడ్ 15 వేల రూపాయలు సహాయం అందించారు. ప్రస్తుతం ఖిల్లా త్రివర్ణ శోభను సంతరించుకుని చూపరులను ఆకర్శి స్తోoది.

Advertisement

తాజా వార్తలు

Advertisement