Monday, May 6, 2024

Education : రేపటినుంచి టీఎస్‌ ఐసెట్‌.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష రేపటి నుంచి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట వరకు, 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 66 పరీక్షా కేంద్రాలలో పరీక్షను నిర్వహిచనున్నట్లు కన్వీనర్‌ కె.రాజిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 75,958 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగా సంబంధిత పరీక్ష కేంద్రానికి చేరుకుని ఫోటో గ్రాఫ్‌, రిజిస్ట్రేషన్‌ను పొందాలని సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement