Sunday, May 5, 2024

ఈ ఎస్ ఐ కుంభకోణం కేసులో ఈడీ ఛార్జిషీట్‌.. 15 మంది నిందితుల‌పై కేసు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) కుంభకోణం కేసులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్‌ మాజీ సంచాలకులు దేవికారాణితో పాటు 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది. గతంలో నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే కొన్నట్లు చూపిస్తూ.. కొందరు ఐఎంఎస్‌ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు 2019లో ఏసీబీ కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement