Monday, April 29, 2024

హుజురాబాద్ లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ: ఈటల

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కి చేరింది. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వియోగం చేస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేయడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బుల, మద్యం పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సీఎం కేసీఆర్ కు అహంకారం ఎక్కువ అయ్యిందన్నారు. ఒట్టి అమాయకున్ని పెట్టి గెలిపిస్తానంటూ శపథం చేశారని పేర్కొన్నారు.  ఇన్నిరోజులు నియోజకవర్గ ప్రజలన్ని కాపాడుకున్నానని, ఇక ముందు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పూటకో మాట మాట్లాడుతున్న టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని ఈటల కోరారు.

ఇది కూడా చదవండి:ఓట్ల కోసం ఈటెల అక్రమాలు.. ఒక్కో ఓటుకు రూ. 5 వేలు

Advertisement

తాజా వార్తలు

Advertisement