Sunday, April 28, 2024

T20: కివీస్ తో గెలిస్తే.. టీమిండియా సెమీస్ చేరుతుందా!

Team India: టీ20 వ‌రల్డ్ క‌ప్‌ 2021లో భాగంగా ఇండియా గ్రూప్ 2 లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓడిపోయింది. వచ్చే ఆదివారం కివీస్ తో జరగబోయే మ్యాచ్ కోసం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తోంది భారత జట్టు. ఇక టీమిండియా జట్టు సెమీఫైనల్ కి చేరాలంటే న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో గెలుపు తప్పనిసరిగా కానుంది.

అటు న్యూజిలాండ్ జట్టుకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇరు జట్లు పాక్ చేతిలో ఓటమిపాలవడంతో జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై అనే ప‌రిస్థితులు వ‌చ్చాయి. గ్రూప్ 1 లో ఉన్న నమీబియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై భారత్, న్యూజిలాండ్ జట్లు అలవోకగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

దీంతో ఈ మ్యాచ్ లో గెలిచిన టీం పాకిస్తాన్ తో పాటు సెమీ ఫైనల్ వెళ్ళే చాన్స్‌లే ఎక్కువున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య పోటాపోటీ తప్పదనే తెలుస్తుంది. మరోపక్క న్యూజిలాండ్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్ కాలిగాయంతో వైదొలగడం కివీస్ జట్టుకు గట్టిదెబ్బ అనే చెప్పాలి. ఏదేమైనా ఆదివారం మ్యాచ్ ఫలితంతో భారత్ – కివీస్ జట్ల టీ20 ప్రపంచకప్ 2021 ప్రయాణం ఎక్కడి వరకు చేరనుందో తెలియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement