Sunday, April 28, 2024

Drugs: అన్నిరాష్ట్రాల‌కు ఏపీ నుంచే గంజాయి స‌ప్ల‌య్ అవుతోంది: వీడియోలు పోస్ట్ చేసిన ప‌వ‌న్

Andhra Pradesh: AP కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

క‌ర్నాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ పేర్కొన్న వీడియోను ప‌వ‌న్ పోస్ట్ చేశారు. ఢిల్లీకి గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోంద‌ని ఢిల్లీ డీసీపీ సంతోష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్య‌ల వీడియోనూ కూడా ప‌వ‌న్ పోస్ట్ చేశారు.

అలాగే, రాజ‌స్థాన్‌లో ప‌ట్టుబ‌డిన గంజాయి విశాఖ నుంచే వెళ్లింద‌ని పేర్కొన్నారు. పూణె, ముంబైలో ఉన్న గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌చ్చింద‌ని మీడియాలో వ‌చ్చిన ఓ వీడియోనూ ఆయ‌న పోస్ట్ చేశారు.

- Advertisement -

అలాగే, మ‌ధ్య‌ప్ర‌దేశ్, కేర‌ళ‌కు కూడా ఏపీ నుంచే గంజాయి అందుతోంద‌ని తెలిపే వీడియోల‌ను ప‌వ‌న్ వ‌రుస‌గా పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement