Thursday, May 2, 2024

భూపాలపల్లి డీపీఆర్ఓ రవికుమార్​కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి.. సిద్దిపేట జిల్లాకు బదిలీ

భూపాలపల్లి, (ప్రభన్యూస్ ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బిజ్జురి రవికుమార్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు శనివారం రాత్రి జిల్లా పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వారి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎంఏ గౌస్ జయశంకర్ జిల్లాకు బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాల పునర్విభజన జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా బిజ్జురి రవికుమార్ బాధ్యతలు నిర్వహించారు.

జిల్లాలో అనేక మంది కలెక్టర్లు మారినప్పటికీ సమన్వయంతో పని చేస్తూ పౌరసంబంధాల శాఖలో ఉన్నత సేవలందించారు. విధినిర్వహణలో జిల్లాలోని వివిధ కార్యక్రమాలపై సత్వర సమాచారం అందిస్తూ అధికారులు, ప్రజలు, జర్నలిస్టుల మన్ననలు పొందారు.వారు జిల్లాను వీడటం బాధాకరమైన పదోన్నతి పొందడం సంతోషకరమని ఎక్కడ పని చేసిన మరిన్ని ఉన్నత సేవలు అందించాలని జర్నలిస్టు మిత్రులు,పలువురు అధికారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement