Monday, May 20, 2024

డబుల్ రోడ్డుకు రూ. 36 కోట్ల మంజూరు – కెసిఆర్, దాసరి చిత్రపటాలకు పాలాభిషేకం

ఓదెల (ప్రభ న్యూస్) పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ల చిత్రపటాలకు బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. సోమవారం ఓదెల మండలం కోలనూరులో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 2018 లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్నో సంవత్సరాల కల అయిన ఓదెల నుండి పెద్దపల్లి డబుల్ రోడ్ మంజూరు చేయించడం హర్షణీయమన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి పెద్దబొంకూర్,కొత్తపల్లి మీదుగా కొలనూర్ ఐకేపీ సెంటర్ మీదుగా ఓదెల మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు కు 36 కోట్లు మంజూరు చేసినందుకు అభివృద్ది ప్రాధాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేకర్ రావుకు, కృషి చేసిన పెద్దపల్లి అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే దాసరి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసి వైస్ ఛైర్మన్, ఓదెల మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, పొత్కపల్లి ప్యాక్స్ వైస్ ఛైర్మన్ మద్దెల కమల నర్సయ్య, సర్పంచ్ సామ మణెమ్మ, ఢిల్లీ శంకర్, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, రైతుబందు సమితి అధ్యక్షుడు బండారు ఐలయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు ఓదెల నరేందర్, పోతర్ల శ్రీనివాస్, కర్రె రాజిరెడ్డి, కలకొండ చిన్న రాజిరెడ్డి ఇటుకల సంపత్ సాంబయ్య ,తోట చందు, చిన్నల భూమయ్య, రామంచ మొండెయ్య, సత్తురి రాజేశం, కొల్లూరి రాజేశం, సత్తురి రవి, మాటేటి రమేష్, గొర్రె జితేందర్, మటూరి రాజు, మటూరు రఘు, మద్దెల శ్రీనివాస్, కర్ణకంటి అంజిరెడ్డి, జంగం అనిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement