Thursday, May 16, 2024

Domakonda – అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రతి ఏటా మాదిరిగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.. దోమకొండ మండలం కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకొన్నారు.

గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బోనాల పండుగను జరుపుకున్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని గ్రామదేవతలకు తమ మొక్కులను తీర్చుకున్నారు. అంత‌కు ముందు ఆల‌యానికి చేరుకున్న ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement