Sunday, May 19, 2024

కర్ణాటక కాంగ్రెస్ కు.. కేసీఆర్ నిధుల పంపిణీ.. బండి సంజయ్

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి నిధులు పంపిస్తున్నది సీఎం కేసీఆరే అని బి జె పి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో ఈ-సేవా భవన ప్రహరీని ప్రారంభించిన బండి సంజయ్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు.. గతంలో జేడీఎస్ కు పోటీ చేస్తామని చెప్పి వాళ్లకు కేసీఆర్ చెయ్యి ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో ఎన్నికలుంటే మహారాష్ట్రలో తిరిగారన్నారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవలేదన్నారు.అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కాంగ్రెస్ కు ఇస్తున్నారని ఆరోపించారు. భజరంగ్ దళ్ పై కాంగ్రెస్ పై నిషేధం విధిస్తామని చెప్పడంతో కర్ణాటక ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అన్నారు.దేశం కోసం.. ధర్మం కోసం పనిచేస్తున్న భజరంగ్ దళ్ ను నిషేధించి, విధ్వాంసాన్ని సృష్టిస్తోన్న పీఎఫ్ఐ పై నిషేధం ఎత్తేస్తారట..భజరంగ్ దళ్ పై ఎందుకు నిషేధం విధిస్తున్నామంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement