Wednesday, May 8, 2024

DGP: ల‌క్ష్మీన‌ర‌సింహుని సేవ‌లో డీజీపీ

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని డీజీపీ రవిగుప్తా సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదగిరిగుట్ట ల‌క్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.

ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. అలాగే కాగా, స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement