Friday, May 3, 2024

TRAIN: శాత‌వాహ‌న ఎక్స్ ప్రెస్‌లో పొగ‌లు…

సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈఘ‌ట‌న జ‌రిగింది.

దీంతో అప్రమత్తమైన తమ లజేజీలతో సహా ప్రయాణికులు ట్రైన్ నుంచి దూకి పరుగులు తీశారు. ఏ భోగిలో మంటలు అంటుకున్నాయో తెలియక భయంతో వణికిపోయారు. ప్రయాణికుల సమాచారం మేరకు లోకో పైలెట్ పొగలు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించగా.. బ్రేక్ లైనర్లు పట్టేయడంతోనే పొగలు వచ్చాయని గ్రహించాడు. ఈ హఠాత్పరిణామంతో ట్రైన్ గుండ్రాతిమడుగు సమీపంలో 15 నిమిషాలు పాటు నిలిచిపోయింది. రైల్వే ఫిట్టర్లు వచ్చి బ్రేక్ లైనర్లు సరిచేయటంతో ట్రైన్ అక్కడి నుంచి విజయవాడ వైపు పరుగులు తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement